జగన్ ని ఉతికారేసిన యామిని

వైసీపీ అధినేత జగన్ పై టిడిపి మహిళా నేత సాదినేని యామిని మండిపడ్డారు. కడప స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం అన్యాయం చేస్తుంటే వైసీపీ నేతలు నోరు కూడా తెరవలేదని టిడిపి మహిళా నేత సాదినేని యామిని అన్నారు. నిధులపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు జగన్‌కు ఓటు వేయకూడదని మైండ్‌లో ఫిక్స్‌ అయిపోయారని చెప్పారు.

జగన్‌కు ఎన్నికల ముందే ప్రజా సమస్యలు తెలిశాయా అని ప్రశ్నించారు. కేంద్రం వెనుకబడిన జిల్లాలకు ఇచ్చినట్లే ఇచ్చి నిధుల్ని ఉపసంహరించుకుంటే ప్రశ్నించని జగన్‌కు ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలని నిలదీశారు. కేంద్రాన్ని ప్రశ్నించలేని జగన్‌కి రాజధాని ప్రజలు ఓట్లు వేయరన్నారు. మోదీ, కేసీఆర్‌కు జగన్ తొత్తుగా మారారని దుయ్యబట్టారు