30 ఇయర్స్ పృథ్వీరాజ్‌ కార్ ఆక్సిడెంట్

సినీ నటుడు , వైసీపీ నేత , ఎస్వీబీసీ మాజీ చైర్మన్ 30 ఇయర్స్ పృథ్వీరాజ్‌ ప్రమాదానికి గురయ్యాడు. బంజారాహిల్స్ లో బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ స‌మీపంలోని వినాయ‌కుడి గుడి ద‌గ్గ‌ర నుంచి పృథ్విరాజ్ కారులో వెళ్తుండ‌గా ఓ ఇన్నోవా కారు వ‌చ్చి ఢీకొట్టింది. దీంతో పృథ్విరాజ్ కారు దెబ్బ‌తిన్న‌ది. ఈ విష‌యాన్ని పృథ్విరాజ్ టీం ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వెల్ల‌డించింది. అయితే పృథ్విరాజ్ కు ఏమైనా గాయాల‌య్యాయా..? లేదా సుర‌క్షితంగానే ఉన్నారా..? అనే విషయాన్ని మాత్రం వెల్ల‌డించ‌లేదు.

శాసన సభ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి మద్దతు తెలిపిన పృథ్వీరాజ్ ..ఆ తర్వాత వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయనకు ఎస్వీబీసీ ఛానల్ కు చైర్మన్ పదవి కట్టబెట్టారు. కానీ అతడి ఫై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆ పదవికి రాజీనామా చేయడం జరిగింది.