
లాక్ డౌన్ కారణంగా సినీ స్టార్స్ అంత గత మూడు నెలలుగా ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులతో గడుపుతూ కొత్త కథలను వింటూ సమయం గడుపుతున్నారు. రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు షూటింగ్ లకు అనుమతి ఇచ్చినప్పటికీ కరోనా కేసులు విపరీతంగా ఉండడం తో ఎవరు కూడా షూటింగ్ లలో జాయిన్ అయ్యేందుకు ముందుకు రావడం లేదు.
ఈ సంగతి పక్కన పెడితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పిక్ బయటకు వచ్చి అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. మరి ఈ ఫోటో షూట్ దేనికోసమో తెలియదు కానీ ఈ స్టిల్ లో మాత్రం ఎన్టీఆర్ స్టయిలిష్ గా ఉన్నాడు.
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ , చరణ్ లు నటిస్తుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.









