
#D54 : నేషనల్ అవార్డ్ విజేత ధనుష్, తన బ్లాక్బస్టర్ హిట్ ‘కుబేర’ తర్వాత తెలుగులో బలమైన మార్కెట్ను ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు అదే ఊపుతో తన 54వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. పోర్ తోజిల్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు విఘ్నేష్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్పై డాక్టర్ ఇషారి కె. గణేష్ ఈ చిత్రాన్ని థింక్ స్టూడియోస్ సహకారంతో భారీగా నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం, ఇదే రోజున రెగ్యులర్ షూటింగ్ను కూడా మొదలుపెట్టింది. అగ్నితో కూడిన పోస్టర్లో ధనుష్ పవర్ఫుల్ లుక్లో కనిపించడం, ఈ సినిమాకు సీరియస్ టోన్ ఉందని తెలియజేస్తోంది.
ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలో మమిత బైజు కథానాయికగా నటించనుండగా, కెఎస్ రవికుమార్, జయరామ్, కరుణాస్, సూరజ్ వెంజరమూడు, పృథ్వీ పాండియరాజన్ వంటి పలువురు ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ, జివి ప్రకాష్ కుమార్ సంగీతం, శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ బాధ్యతలు చేపడుతున్నారు. మల్టిపుల్ లొకేషన్లలో చిత్రీకరించనున్న ఈ ప్రాజెక్ట్కు విఘ్నేష్ రాజా, ఆల్ఫ్రెడ్ ప్రకాష్ కలిసి స్క్రిప్ట్ అందించారు. క్వాలిటీ కంటెంట్కు కేటాయించిన ప్రాధాన్యతతో ఈ చిత్రం ప్రేక్షకులకు థియేటర్లో ఒక ఘనమైన అనుభూతిని అందించనుంది.









