Mass Jathara Trailer : రవితేజ ‘మాస్ జాతర’ ట్రైలర్‌తో మాస్ ఫీస్ట్!

Massjathara
Mass Jathara Trailer : రవితేజ, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తుండగా, రవితేజ–భీమ్స్ కాంబోలో వచ్చిన ‘ధమాకా’ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి రెస్పాన్స్‌ పొందాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.

Also Read :  Panja Vaisshnav: మూడేళ్ల గ్యాప్.. 100 కథల రిజెక్షన్! ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్‌లో పెట్టిన మెగా హీరో

ట్రైలర్‌లో రవితేజ తన ఎనర్జీ, కామెడీ, యాక్షన్‌తో మరోసారి అభిమానులను అలరించాడు. చాలాకాలం తర్వాత ఆయనను పూర్తిగా మాస్ అవతారంలో చూసిన అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమాలో రవితేజ రైల్వే ఎస్సై పాత్రలో కనిపించబోతుండగా, “రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్ ఉంటాయ్.. నేను వచ్చినాక ఒకటే జోన్ – వార్ జోన్” అనే డైలాగ్ ట్రైలర్‌లో హైలైట్‌గా మారింది. ఇక శ్రీలీల శ్రీకాకుళం యాసలో మాట్లాడిన “పళ్లు రాలగొట్టేస్తాను ఏటి అనుకున్నావేటో” అనే డైలాగ్‌తో మంచి మాస్ టచ్ ఇచ్చింది. ఈ సినిమాలో నవీన్ చంద్ర విలన్‌గా కనిపిస్తుండగా, రాజేంద్ర ప్రసాద్, నరేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్, కామెడీ, ఎమోషన్ కలగలిపిన ఈ సినిమా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Also Read :  Upasana Konidela: ‘పెద్ది’ క్రేజ్‌కు ఫిదా అయిన మెగా కోడలు.. పేపర్లు ఎగరేస్తూ రచ్చ రచ్చ! వైరల్ అవుతున్న వీడియో