
తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను బుల్లితెర నిర్మాతల కమిటీ మర్యాదపూర్వకంగా కలిశారు. లాక్ డౌన్ సమయంలో 2వేలమంది టీవీ నటులకు తలసాని నిత్యావసరాలు సరఫరా చేయడం జరిగింది. దానికి గాను ఆయనకు నిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంధర్బంగా తలసాని వారితో ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు.
కరోనా గురించి మాట్లాడుతూ.. అన్ని రంగాలకు కరోనా ఒక సవాల్ గా మారిందని, వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నివారణ సాధ్యమేనని తెలిపారు. అంతే కాకుండా షూటింగ్ సమయంలో భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.









