HYDRA : హైడ్రా మరో ముందడుగు, పిర్యాదులకోసం యాప్


నగరంలోని చెరువుల పరిరక్షణపై లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హైడ్రా కమిషనర్ మరియు లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ నేతృత్వంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చెరువుల ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) మరియు బఫర్ జోన్లను గుర్తించడానికి ఇరిగేషన్, రెవెన్యూ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, సర్వే ఆఫ్ ఇండియా వంటి అధికారులతో చర్చలు జరిపారు. చెరువులను ఆక్రమణలకు గురికాకుండా నిరంతరం నిఘా పెట్టేందుకు హైడ్రా యాప్ తీసుకురానుంది. ఈ యాప్ ద్వారా ప్రజలు చేర్చిన ఫిర్యాదులు క్షేత్ర స్థాయిలో అధికారుల పరిశీలనకు వెళ్తాయి. దీనితో ఆక్రమణలను అడ్డుకోవడం సులభం అవుతుంది.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

హైడ్రా చెరువుల పునరుద్ధరణపై కూడా చర్యలు చేపడుతుంది, ఆక్రమణలు తొలగించిన చెరువుల్లో డెబ్రీస్ తొలగించడంలో దృష్టి పెట్టనుంది. మొదటి దశగా సున్నం చెరువు, అప్పా చెరువు, ఎర్రకుంట, కూకట్‌పల్లి నల్ల చెరువులను పునరుద్ధరించే పనులు ప్రారంభమవుతాయి. చెరువుల పరిరక్షణ కోసం శాస్త్రీయ పద్ధతుల ఆధారంగా 45 ఏళ్ల డేటాను పరిశీలించి, ఫుల్ ట్యాంక్ లెవల్ మరియు వాటర్ స్ప్రెడ్ ఏరియాలను గుర్తించనున్నారు. హిమాయ‌త్ సాగ‌ర్‌తో ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్ల గుర్తింపు ప్రారంభించి అదే విధానాన్ని అన్ని చెరువుల విష‌యంలో పాటించేందుకు చర్యలు చేపట్టనున్నారు.