పలు సినిమాలతో పాటు టీవీ సీరియల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి ప్రియాంక(33) ఈ రోజు తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. వలసరవక్కంలోని తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని చనిపోయింది. ఇంటి పని మనిషి వచ్చి చూడడంతో ప్రియాంక విగతజీవిగా కనిపించింది. వెంటనే ఆమె పోలీసులకి సమాచారం అందించడం తో వెంటనే ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు మొదలు పెట్టారు.
మూడేళ్ళ క్రితం అరుణ్ బాల అనే వ్యక్తిని వివాహం చేసుకున్న ఆమె మూడు నెలలుగా భర్తకి దూరంగా ఉంటుంది. కుటుంబ కలహాల కారణంగానే ప్రియాంక ఆత్మహత్య చేసుకుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందిన వంశం అనే సీరియల్తో ప్రియాంక బాగా పాపులర్ అయ్యింది. ఆమె మృతికి తమిళ సీరియల్ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది. ఈ మధ్య కాలంలో తమ కెరీర్తో పాటు పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోలేక పోతూ చాలామంది మంచి నటి నటులు ఇలా ఆత్మ హత్య చేసుకొని మరణిస్తున్నారని ప్రముఖులు చెప్పుకొచ్చారు.