ఉత్కంఠ పోరులో మనదే విజయం


హైదరాబాద్‌ మరోసారి అదరగొట్టింది. రాజస్థాన్‌ తో చివరి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. నితీశ్‌ రెడ్డి (76: 42 బంతుల్లో 8 సిక్స్‌లు, 3 ఫోర్లు,) వీరవిహారం చేయగా, ట్రావిస్‌ హెడ్‌ (58: 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో రాణించాడు.

అనంతరం 202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రియాన్‌ పరాగ్‌ (77: 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) , యశస్వి జైస్వాల్‌ (67: 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు)అర్ధశతకాలు చేసినప్పటికీ రాజస్థాన్‌ను గెలిపించలేకపోయారు. హైదరాబాద్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ 3, నటరాజన్‌ 2, కమిన్స్‌ 2 వికెట్లు తీశారు.