తెలుగులో ‘ప్రేమికుల రోజు’, ‘మురారి’, ‘ఇంద్ర’, ‘ఖడ్గం’, ‘మన్మథుడు’, ‘పలనాటి బ్రహ్మనాయుడు’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సోనాలీ బింద్రే ఇటీవల క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె న్యూయార్క్లో చికిత్స పొందుతుంది. ఈమెకు క్యాన్సర్ రావడం అభిమానులే కాదు ఎవరు కూడా నమ్మలేక పోతున్నారు. కాన్సర్ తో పోరాడుతున్న సోనాలీ, తొందరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగిరావాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యం లో తన కొడుకుకు ఈ విషయాన్నీ ఎలా చెప్పాలో తెలియలేదంటూ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్నీ తెలియజేసింది.
తాజాగా.. కుమారుడు రణ్వీర్తో దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన సొనాలి… తాను క్యాన్సర్ బారిన పడిన విషయాన్ని అతడితో ఎలా పంచుకున్నది చెబుతూ ఓ లేఖ రాసింది..ఈ లేఖ అందరి మనసులను కదిలించిస్తుంది. ‘పన్నెండేళ్ల క్రితం జన్మించిన రణ్వీర్.. నా హృదయాన్ని పూర్తిగా ఆక్రమించేశాడు. అప్పటి నుంచి తన సంతోషం కోసమే అనుక్షణం తాపత్రయపడ్డాను. క్యాన్సర్ మహమ్మారి నాలో ప్రవేశించిన విషయం తెలియగానే.. ఈ విషయాన్ని తనకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. నాకు సంబంధించిన ప్రతీ విషయాన్ని వాడితో షేర్ చేసుకోవడం అలవాటు. కానీ ఈ విషయాన్ని దాచి వాడిని బాధను మరింతగా పెంచడం సరైంది అనిపించలేదు. అందుకే ధైర్యం చేసి ఈ చేదు నిజాన్ని చెప్పేశాను. కానీ నేను ఊహించిన దానికి భిన్నంగా రణ్వీర్ ఎంతో పరిపక్వంగా ఆలోచించాడు. చెప్పాలంటే తనే నాకు ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు. ఒక్కోసారి తనే తల్లిలా నన్ను లాలిస్తున్నాడు. ట్రీట్మెంట్కు సంబంధించిన అపాయింట్మెంట్ల గురించి గుర్తు చేస్తున్నాడు. మన ఆరోగ్యానికి సంబంధించిన విషయాల గురించి పిల్లలతో తప్పకుండా పంచుకోవాలి. అపుడే జీవితంలో సంభవించే కఠిన పరిస్థితులను ఎదుర్కోవడానికి వారు సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం నా కొడుకు నాతోనే ఉన్నాడు. నాకు ఇక ఏ బెంగా లేదంటూ’ సొనాలి బింద్రే భావోద్వేగానికి గురయ్యారు.