సమంత నటించిన యూ టర్న్ మూవీ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. పవన్ కుమార్ డైరెక్షన్లో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ తెలుగు తో పాటు తమిళం లో ఒకేరోజు విడుదలై రెండు భాషల్లో మంచి టాక్ సొంతం చేసుకొని సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లలో రన్ అవుతుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను ఏర్పటు చేసారు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా తెలంగాణ ఎంపీ కవిత హాజరయ్యారు.
ఈ సందర్భాంగా ఆమె మాట్లాడుతూ ” తాను ఇంకా సినిమాని చూడలేదని.. తన ఇద్దరు పిల్లల ద్వారా రివ్యూ తెలుసుకున్నానని తెలిపింది. రంగస్థలంలో పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన సమంత యూటర్న్ చిత్రంలో జర్నలిస్ట్గా చక్కని నట ప్రదర్శన చేశారని ఆమె అన్నారు. ఇక దర్శకుడు థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులని సినిమా థియేటర్స్కి రప్పించారని , సినిమాలో భాగం అయిన మిగతా సభ్యులందరికి తన బెస్ట్ విషెష్ ను అందిస్తున్నట్లు ” తెలిపింది.
ఈ చిత్రంలో సమంతతో పాటు భూమిక , అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం ఫై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈచిత్రానికి పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం అందించారు.