తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో టీకాంగ్రెస్లో కమిటీల నియామకం చిచ్చు రగుల్చుతోంది. కమిటీ కూర్పుపై తెలంగాణ కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఢిల్లీ పార్టీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్లో కమిటీల రూపకల్పనపై రాజగోపాల్రెడ్డి బహిరంగ విమర్శలకు దిగారు. వార్డు మెంబర్గా కూడా గెలవని వారికి కమిటీలో ప్రాధాన్యత ఇచ్చారని రాజగోపాల్రెడ్డి ఆరోపించారు. జైలుకు వెళ్లిన వారికి పదవులా? అని ఆ పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. బ్రోకర్లను తీసుకొచ్చి గాంధీభవన్లో పెట్టారని, కుంతియా రాష్ట్ర కాంగ్రెస్కు శనిలా దాపురించాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.