‘డబ్బు ఉండే సరికి నాలుగు గోడలు లేపేసి జనాలకు భక్తి ఉంది కాదా అని ఏదో ఒక రాయిని విగ్రహంగా పెట్టేస్తే.. అది దేవాలయం అవుతుందా చెప్పు’ అంటున్నాడు సుమంత్. సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈషా రెబ్బా కథానాయిక.
ఈ సినిమా టీజర్ను తాజాగా విడుదల చేశారు. ‘శివానంద తీర్థులు మన ఊరికి ఉన్నట్లుండి ఎందుకొచ్చారు’ అనే డైలాగ్తో టీజర్ ప్రారంభమైంది. ‘ఆ భగవంతుడు ఈ ఊరికి రక్షణగా ఒకడ్ని సిద్ధం చేసే ఉంచాడు’ అని గుడిలో పూజారి చెబుతున్నారు. ‘కార్తీక్.. ఈయన ఇలా హేతుబద్ధంగా ఆలయాలపై పరిశోధన చేస్తున్నారు’ అంటూ సుమంత్ను ఓ వ్యక్తి పరిచయం చేశారు.
‘ఇలాంటి గుడి మీద నీ అభిప్రాయం ఏంటి?’ అని సుమంత్ను ఆయన స్నేహితుడు ప్రశ్నించగా.. ‘డబ్బుండే సరికి నాలుగు గోడలు లేపేసి.. జనానికి భక్తి ఉంది కదా అని ఏదో ఒక రాయిని విగ్రహంగా పెట్టేస్తే అది దేవాలయం అవుతుందా చెప్పు’ అని సమాధానం ఇవ్వడం ఆసక్తికరంగా వుంది.