యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం సినిమా ప్రేక్షకులు మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీ లోని హీరోయిన్లు సైతం ప్రభాస్ ను ఇష్టపడతారు.. ఆ ఇండస్ట్రీ , ఈ ఇండస్ట్రీ అనే కాదు అన్ని ఇండస్ట్రీ హీరోయిన్లు ప్రభాస్ అంటే ప్రాణం అని చెపుతుంటారు. తాజాగా ఇదే మాటను స్టార్ హీరో కూతురు పబ్లిక్ గా చెప్పి అభిమానులను ఆకట్టుకుంది. ఇంతకీ ఆమె ఎవరా అని చూస్తున్నారా..ఆమెనే వరలక్ష్మి శరత్ కుమార్.
శరత్ కుమార్ కూతురుగా సినిమా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఈ భామ, సినిమాల కంటే కూడా విశాల్ లవర్ గానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. తమిళనాట చాలా తక్కువ సినిమాల్లో హీరోయిన్ గా చేసిన వరలక్ష్మి..ప్రస్తుతం విలన్ రోల్స్ చేస్తూ బిజీ అవుతుంది. మొన్న విడుదలైన విశాల్ “పందెంకోడి 2” లో విలన్ గా అదరగొట్టిన ఈమె , తాజాగా విజయ్ “సర్కార్” సినిమాలో విలన్గా నటించింది. ఈ సినిమా తెలుగు , తమిళ్ భాషల్లో దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్బంగా చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న వరలక్ష్మి..ఇప్పటి వరకు తాను విభిన్నమైన కథలను .. పాత్రలనే ఎంచుకుంటూ వస్తున్నానని.. ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేయడం లేదని చెప్పింది. ఎప్పటికైనా కెరీర్ లో ఒక్కసారైనా చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలో నటించాలనేది తన ఆశ అని చెప్పింది. ఇక అభిమాన హీరో ఎవరు అంటే మరో ఆలోచన లేకుండా ప్రభాస్ అని తెలిపింది. బాహుబలి చూసిన తర్వాత ఆయన ఫ్యాన్ అయిపోయానని తెలిపి , అభిమానుల మనసు గెలిచింది.