మాటల రచయితగా ఎంతో గుర్తింపు ఉన్న సాయి మాధవ్ బుర్రా..ఇప్పుడు మేకప్మేన్గా మారబోతున్నాడు. అది కూడా ఎన్టీఆర్ కోసం. క్రిష్ – బాలకృష్ణ కలయికలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ మొదటి భాగం అంత ఎన్టీఆర్ సినీ జీవితాన్ని, రెండో భాగాన్ని రాజకీయంగా చూపించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాలోని నటి నటుల పాత్రల తాలూకా విశేషాలు తెలియజేసి సినిమా ఫై ఆసక్తి పెంచుతూ వస్తున్న చిత్ర మేకర్స్..తాజాగా మరో వార్తను తెలియజేసారు.
‘యన్.టి.ఆర్ కథానాయకుడు’లో ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా కీలక పాత్రలో నటించనున్నారట. ఎన్టీఆర్ వ్యక్తిగత మేకప్మేన్గా పనిచేసిన పీతాబరం పాత్రలో సాయి మాధవ్ నటిస్తున్నట్టుగా సమాచారం. ఎన్టీఆర్ను తెలుగు ప్రేక్షకులకు ఆరాధ్యుడిగా మార్చిన కృష్ణుడి మేకప్ను వేసింది పీతాంబరమే. అందుకే ఆయన పాత్రను చూపించబోతున్నారట. ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఎన్.బి.కె బ్యానర్ ఫై బాలకృష్ణ నిర్మిస్తున్నారు.