సుధీర్ ఇప్పుడు బాధ పడుతున్నాడు..

సమ్మోహనం , నన్ను దోచుకుందువటే సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న సుధీర్ బాబు..సినిమా కథల ఫై ఇంకాస్త శ్రద్ద పెడుతూ ముందుకు వెళ్తున్నాడు. ప్రస్తుతం సొంత బ్యానర్ లో గోపీచంద్ బయోపిక్ సినిమా చేస్తున్నాడు. అలాగే హీరో నాని తో కలిసి ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ”వి” అనే సినిమా చేస్తున్నాడు. కాగా ఓ బాలీవుడ్ ఆఫర్ మిస్ చేసుకోవడం లో బాధపడుతున్నట్లు తెలుస్తుంది.

ఆ మధ్యలో హిందీ సినిమా బ్రహ్మాస్త్రలో అవకాశం వచ్చిందట. నాగార్జున తో పాటు సుధీర్ బాబు ఇలా మరి ఒకరిద్దరు సౌత్ స్టార్స్ ను తీసుకోవాలనుకున్నారు. గతంలో సుధీర్ బాబు ఓ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర చేసి వుండడంతో, మళ్లీ అదే షేడ్స్ వున్న పాత్ర ఆఫర్ చేసారు. కానీ తెలుగులో రెండు సినిమాలు చేస్తుండడం తో ఆ సినిమా ఛాన్స్ ను మిస్ చేసుకున్నాడట. కొంచెం అటు ఇటు గా డేట్స్ అడ్జెస్ట్ చేసి చేస్తే బాగుండేదేమో అని ఇప్పుడు అనుకుని బాధపడుతున్నాడట.