2019-2022 ఏడాదికి గానూ ఈ నెల 23న నడిగర్సంఘం ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో విశాల్ పాండవర్ జట్టు, కే.భాగ్యరాజ్ స్వామి శంకరదాస్ జట్టు బరిలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. విశాల్ ఇటీవల శరత్ కుమార్, రాధారవి న్యాయకత్వాన్ని విమర్శిస్తూ ఓ వీడియోను అప్లోడ్ చేశారు.
దీనిపై ఇప్పటికే శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. తన తండ్రి ఈ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ ఆయనపై ఇంత కక్ష సాధింపు చర్యలు ఎందుకు..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.కాగా దినిపై విశాల్ స్పదించాడు. వరలక్ష్మి చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయమని అన్నాడు. ఆమెకు మాట్లాడే హక్కు ఉందని చెప్పుకొచ్చాడు.