కియారా అద్వానీ..ప్రస్తుతం ఈ పేరు సినీ వర్గాల్లో హాట్ హాట్ గా నడుస్తుంది. తెలుగులో భరత్ అనే నేను , వినయ విధేయ రామ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు..బాలీవుడ్ లో కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి గోల్డెన్ లెగ్ గా మారింది. అమ్మడి తో సినిమాలు చేసేందుకు అగ్ర దర్శక , నిర్మాతలు పోటీ పడుతున్నారు. తెలుగులో పెద్దగా అవకాశాలు రానప్పటికీ..బి టౌన్ లో మాత్రం బిజీ బిజీ గా ఉంది.
ఇప్పటికే పలు ప్రాజెక్ట్ లకు సైన్ చేసిన ఈ బ్యూటీ..తాజాగా చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ గా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న బూల్ బులైయా 2 లో హీరోయిన్ గా ఈమెను ఎంపిక చేసారు. అనీస్ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా,ఈ చిత్రాన్ని కబీర్ సింగ్ మేకర్స్ భూషణ్ కుమార్, మూరద్ కేతని, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు. కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. 2020 జులై 31 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.