పవన్ – చిరంజీవి మళ్లీ విడిపోయారా..?

ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో కలపడం తో పవన్ కొన్ని నెలలపాటు చిరంజీవి తో మాట్లాడలేదని సంగతి తెలిసిందే. ఈ మధ్యనే మళ్లీ వీరిద్దరూ కలిశారు. కానీ ఇప్పుడు మరోసారి వీరిద్దరూ విడిపోయారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. కాకినాడలో పవన్ కళ్యాణ్ దీక్షకు దిగిన రోజే… దిశ చట్టం తీసుకొచ్చిన సీఎం జగన్‌ను అభినందిస్తూ చిరంజీవి ప్రకటన విడుదల చేశారు.

ఓ వైపు పవన్ కళ్యాణ్ జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సమయంలోనే చిరంజీవి జగన్ నిర్ణయాన్ని సమర్థించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో మెగా ఫ్యామిలీలో మళ్లీ రాజకీయంగా విభేదాలు వచ్చాయా ? అనే చర్చ మొదలయ్యింది. గత కొన్ని రోజులుగా వైసీపీ ప్రభుత్వం ఫై ..జగన్ కు దగ్గరగా చిరంజీవి మెలుగుతున్న సంగతి తెలిసిందే. తమ్ముడు జగన్ ఫై ఎన్ని విమర్శలు చేసిన చిరు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా జగన్ ను ఎప్పటికప్పుడు మద్దతు తెలుపుతూ వస్తున్నాడు. దీంతో ఈ ఇద్దరు మెగా బ్రదర్స్ విడిపోయారని అంత మాట్లాడుకోవడం మొదలు పెడుతున్నారు.