ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొద్దీ సేపటి క్రితం ప్రారంభమైంది. ఈ సమావేశం ఫై అందరి దృష్టి నెలకొని ఉంది. ఎందుకంటే ఈ సమావేశంలో పలు కీలక అంశాల ఫై తుది ప్రకటన చేయబోతున్నారు. శాసనమండలి రద్దు, భోగాపురం ఎయిర్పోర్ట్, మచిలీపట్నం పోర్టులపై మంత్రివర్గం చర్చించనుంది. కేబినెట్ నిర్ణయం తర్వాత అసెంబ్లీ చర్చించి, ఆ తర్వాత తీర్మానం చేయనుంది.
ఈ ఉదయం11గంటలకి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా కొన్ని బిల్లులని ఏపీ అసెంబ్లీ ఆమోదించనుంది. ఆ తర్వాత మండలి రద్దు బిల్లుని సభలో ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది. ఇక ఈరోజు అసెబ్లీ సమావేశాలకు తెలుగు దేశం పార్టీ దూరంగా ఉండనుంది.