సింగర్ అవతారమెత్తిన వైసీపీ ఎమ్మెల్యే..

ప్రజలకు సేవ చేయడమే కాదు నాలో కూడా మంచి సింగర్ ఉన్నాడని నిరూపించాడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నెల్లూరులో ఏర్పాటు చేసిన సభలో తన దేశభక్తిని చాటుకున్నారు. ఐయామ్ ఏ ఇండియన్ అంటూ పాటను పాడి ఆకట్టుకున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి టాలెంట్‌ చూసిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సభకు వచ్చిన వాళ్లు చప్పట్లు, ఈలలతో మార్మోగించారు.

ఈ సభలో ఓ బాలిక మోదీ ,అమిత్ షా జోడి అంటూ ఓ పాట పాడారు. ఆమెపై ప్రశంసలు కురిపించిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అభినందించారు. సభలో ఉత్సాహంతో తాను కూడా పాట పాడతాను అన్నారు. తన గొంతు అంత బాగా ఉండదంటూనే పాటను అందుకున్నారు. ఐయామ్ ఏ ఇండియన్ అంటూ పాట పాడారు.