హిట్..ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్తున్న తమిళ్ హీరో విశాల్ ప్రస్తుతం ఎంఎస్ ఆనందన్ బాలసుబ్రమణ్యం డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఈ చిత్రానికి తెలుగు లో చక్ర అనే టైటిల్ ఫిక్స్ చేసారు. దీనికి సంబందించిన ఫస్ట్ లుక్ ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంది.
అయితే విశాల్ కంపెనీలో పనిచేసే ఒక మహిళ గత ఆరేళ్లలో రూ .45 లక్షలకు పైగా మోసం చేసి డబ్బు కూడపెట్టినట్టు తాజా విచారణలో తేలింది. ఈ డబ్బుతో ఇల్లు కూడా కొన్నది. ఈ విషయం తెలుసుకున్న ప్రొడక్షన్ హౌస్ మేనేజర్ హరి చెన్నైలోని వడపాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆమెపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.