మహానటి చిత్రంతో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న కీర్తి సురేష్..రీసెంట్ గా చాల స్లిమ్ గా మరి షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ భామ కు మహేష్ సరసన నటించే ఛాన్స్ వచ్చిందనే వార్తలు ఆమె అభిమానులను ఫుల్ ఖుషి చేసాయి.
పరుశురాం – మహేష్ కలయికలో తెరకెక్కుతున్న సర్కారీ వారి పాట చిత్రంలో కీర్తి ని హీరోయిన్ గా ఎంపిక చేసారని అంత అనుకున్నారు. కానీ చిత్ర యూనిట్ మాత్రం కొత్త భామ కోసం వేట మొదలుపెట్టారట. వీలైనంత తక్కువ బడ్జెట్ తో తీయనున్న నేపథ్యంలో ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ కాకుండా కొత్త హీరోయిన్ కోసం వేటలో పడినట్ ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.
పరశురాం ఇప్పటివరకు హీరోయిన్ ఎవరనే విషయంపై అధికారికంగా ప్రకటన చేయలేదు. మహేశ్బాబు, 14 రీల్స్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.