కేవలం అడ్వాన్స్ బుకింగ్ తో వంద కోట్ల వచ్చాయట..నిజమా..?

మోహన్ లాల్ హీరోగా ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ తెరకెక్కించిన చిత్రం మరక్కార్. రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆంటోని పెరంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అర్జున్‌, కీర్తిసురేశ్‌, సునీల్‌శెట్టి, సుహాసిని, కల్యాణి ప్రియదర్శన్‌ వంటి తారలు ఈ సినిమాలో నటించారు. ముందుగా ఈ సినిమాను ఓటిటి లో రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ అభిమానులు ఆందోళన చేయడం తో ఈరోజు థియేటర్స్ లలో రిలీజ్ చేసారు.

మోహన్ లాల్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ పోస్టర్ ను తెగ షేర్ చేస్తున్నారు. దేశంలో ఇప్పటి వరకు ఏ సినిమాకు దక్కని అరుదైన రికార్డు మరక్కార్ సినిమాకు దక్కింది అంటూ వారు ఆ పోస్టర్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందులో నిజం ఎంత అనేది తెలియదు కాని ఆ పోస్టర్ అనుసారంగా కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మరక్కార్ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకుందట. కేవలం అడ్వాన్స్ బుకింగ్ తో వంద కోట్ల వసూళ్లు దక్కించుకున్న ఇండియన్ సినిమా ఒక్కటి అంటే ఒక్కటి కూడా లేదు. అది కేవలం మోహన్ లాల్ సినిమానే అంటే ఆయన అభిమానులు నెట్టింట తెగ హడావుడి చేస్తున్నారు.