బాబు దెబ్బ‌కి జ‌గ‌న్ టూర్ ఆగిందా.?

జగన్ కుమార్తె లండన్ లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె వద్దకు వెళ్లి రావాలని జగన్ భావించాడు. మే 05 న కుటుంబ సమేతంగా లండన్ వెళ్లాలని..మళ్లీ మే 14 న తిరిగిరావాలని ప్లాన్ చేసాడు. కానీ రేపు ప్రయాణం అనగా..సడెన్ గా ఆయన టూర్ రద్దు చేసుకున్నారు. టూర్ రద్దు వెనుక కారణాలు ఏంటి అనేది పార్టీ నేతలకు కూడా జగన్ చెప్పలేదట.

కానీ తెలుగుదేశం నేతలు చేసిన వాఖ్యలకే ఆయన టూర్ రద్దు చేసుకున్నారనే వార్తలు తెలుగుదేశం మీడియా ప్రచారం చేస్తుంది. ఏపీలో ‘ఫణి’ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు అట్టుడుకుతున్నాయి. వైఎస్ జగన్ ఈ వ్యవహారాలేమీ పట్టించుకోకుండా సినిమాలు, టూర్‌లకు వెళ్తున్నారని టీడీపీ నేతలు, చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉండాలని జగన్ నిర్ణయించుకున్నట్లు వారు చెపుతున్నారు.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.