జగన్ టార్గెట్ లోకేశేనా..?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులుండరు..అలాగే శాశ్వత శత్రులుండరు..ఒకవేళ ఎప్పటికి శాశ్వత శతృవులైతే మాత్రం వారి నాశనాన్ని కోరుకుంటారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ..చంద్రబాబు ఫ్యామిలీ అలాగే ఉన్నారు. వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి..చంద్రబాబు మంచి స్నేహితులు. ఇద్దరు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఆ తర్వాత ఇద్దరు వేరు వేరు పార్టీల్లోకి వెళ్లారు.. ఎన్టీఆర్ టీడీపీ పార్టీ ని తన చేతుల్లోకి తీసుకొని బాబు ముఖ్యమంత్రి అయితే..రాజశేఖర్ రెడ్డి మాత్రం ఒక్కో అడుగు వేస్తూ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నాడు. ఈ సమయంలోనే బాబు vs రాజశేఖర్ రెడ్డి గా మారింది.

రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ ని దెబ్బ తీయాలని అనుకున్న బాబు..మెల్లగా జగన్ ఫై అనేక కేసులు వేయించి జైలు కు వెళ్లేలా చేసారు. ఆ తర్వాత జగన్ పూర్తిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయో తెలియంది కాదు..ఇక ఇప్పుడు జగన్ టార్గెట్ లోకేష్ అయ్యాడు..లోకేష్ ను జగన్ టార్గెట్ చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. వీరు ఇంకేమంటున్నారో వారి మాటల్లోనే వినండి.