జ‌న‌సేన అభ్య‌ర్థుల స్టాంప్ పేప‌ర్ ఒప్పందం

జ‌న‌సేన అభ్య‌ర్థుల స్టాంప్ పేప‌ర్ ఒప్పందం ఇప్పుడు రాజకీయాల్లో సరికొత్త నాంది అవుతుంది. విశాఖ పట్నం బరి నుండి ఎంపీ స్థానం లో పోటీ చేస్తున్న జేడీ ..బాండ్ పేపర్ మీద ఇవ్వబోతున్నానని.. వాటిని చేయకుంటే తనను కోర్టుకు లాగొచ్చని.. ఆ దమ్ము తమ పార్టీకి ఉందని వ్యాఖ్యానించారు. జేడీ ప్రకటనను జనసేన పార్టీ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో ‘విశాఖపట్నానికి మేనిఫెస్టో నేను బాండ్ పేపర్ మీద ఇవ్వబోతున్నాను. రేపు నన్ను కోర్టుకు లాగొచ్చు మీరు చెయ్యలేదు అని. ఆ దమ్ము ఉంది మాకు’అన్నారు.

ఇప్పుడు ఈయన పద్దతిలోనే మరికొంతమంది జనసేన అభ్యర్థులు బాండ్ పేపర్ మీద సంతకం చేస్తున్నారు. ఇది వారి సొంత నిర్ణయమా..లేక పార్టీ నే ఈ పద్ధతి పెట్టిందా అనేది తెలియనప్పటికీ..రాజకీయ విశ్లేషకులు మాత్రం దీని గురించి చర్చిస్తున్నారు. మరి వారి మాటల్లోనే మీరే వినండి.