లోకేష్‌కి మరో పేరు..

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పెద్ద ఇబ్బంది అంటే తన కొడుకు లోకేషే..ఆయన ప్రసంగాల్లో ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు..సొంత పార్టీ కే ఓట్లు వెయ్యడని ప్రజలను కోరిన మహానేత..మొన్నటి ఎన్నికల ప్రచారంలో లోకేష్ కామెడీ ఎంత వైరల్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు. అందుకే లోకేష్ ను అందరూ ముద్దుగా పప్పు అంటారు. ముందుగా లోకేష్ కు ఈ పేరు పెట్టింది వైసీపీ మహిళా నేత రోజా. రోజా పెట్టిన ఈ పేరు ఆ తర్వాత అందరూ అలాగే పిలవడం స్టార్ట్ చేశారు.

తాజాగా లోకేష్ కు మరో పేరు పెట్టారు ఏపి బీజేపి నేత సోము వీర్రాజు. లోకేష్ ఓ తింగర మంగళం అంటూ సంభోదించారు. కేంద్రం కియా కంపెనీని ఏర్పాటుచేస్తే అది తానే తెచ్చానని చంద్రబాబు డబ్బా కొట్టుకుంటున్నారని సోము వీర్రాజు విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో, రాయడంలో చంద్రబాబు చిత్రగుప్తుడని ఎద్దేవా చేశారు. ఆయన కుమారుడు లోకేశ్ మంగళగిరి అనే పదాన్నే సరిగ్గా పలకలేకపోతున్నారనీ, లోకేశ్ ఓ తింగరి మంగళం అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.