తెలుగుదేశం కంచుకోటలు బద్దలు..

టీడీపీ కంచుకోటాలు అనగానే శృంగవరపు కోట, విజయనగరం, పాయకరావుపేట, నర్సీపట్నం వంటి నియోజకవర్గాలు గుర్తుకొస్తాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఏడెనిమిది సార్లు విజయపరంపర కొనసాగించిన ఈ నియోజకవర్గాల్లో ఇప్పుడు వైసీపీ జెండా రెపరెపలాడింది.

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో 8సార్లు విజయం సాధించిన టీడీపీ ఇప్పుడు ఓటమి పాలైంది. అశోకగజపతిరాజు విజయనగరం స్థానం నుంచి అయిదుసార్లు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టగా.. ఈసారి అక్కడ నుంచి పోటీచేసిన ఆయన కుమార్తె అదితి ఓటమి చవిచూశారు. పొన్నూరు నుంచి అయిదుసార్లు గెలిచిన నరేంద్రకుమార్‌కు ఈసారి ఓటమి తప్పలేదు. ఏడుసార్లు గెలుచుకున్న శ్రీకాళహస్తిలోనూ తెదేపా పరాజయం పాలైంది.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.