కేవలం చరణ్ కి మాత్రమే దక్కిన గౌరవం

మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు రామ్‌ చరణ్‌ నేడు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకొంటున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ఆయన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా అరుదైన గౌరవాన్ని పొందారు. న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ వద్ద ఉన్న నాస్డాక్ భారీ భవంతిపై ఆయన ఫోటోలు ప్రదర్శించారు.

ఈ అరుదైన గౌరవాన్ని పొందిన మొట్టమొదటి దక్షిణాది నటుడు రామ్‌చరణ్‌. నాస్డాక్ బిల్‌బోర్డ్‌లలో చరణ్‌ పోస్టర్‌లను కలిగిన వీడియోని ఆయన సతీమణి కొణిదెల ఉపాసన తన ట్వీటర్‌లో షేర్‌ చేసింది. ‘‘ఇదొక స్టార్‌ స్ట్రక్.. తీపి గుర్తు..’’ అంటూ పేర్కొంది. ప్రస్తుతం రామ్ చరణ్‌ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో చిరంజీవితో కలిసి నటిస్తున్నారు. చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘ఆచార్య’ చిత్రబృందం ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. అందులో చిరు – రామ్‌ తుపాకులు పట్టుకొని కనిపించారు. ఈ స్టిల్‌ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.  మే 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.