మండిపోతున్న వకీల్ సాబ్ టికెట్లు

ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన చిత్రం `వ‌కీల్ సాబ్‌`. ప‌వ‌న్ రీ ఎంట్రీ కోసం అభిమానులు ఎప్ప‌టి నుంచో  ఎదురుచూస్తున్నారు.  ఏప్రిల్ 9న వాళ్లకు పండ‌గే. అయితే ఏప్రిల్ 8 అర్థ‌రాత్రి నుంచే ప్రీమియ‌ర్ షోల హ‌డావుడి ప్రారంభం కానుంది.

ఐతే టికెట్ ధర మాత్రం కాలిపోతుంది. మాములుగా లేదు. టికెట్ ధ‌ర రూ500 గా నిర్ణయించార‌ని టాక్. తెల్ల‌వారుఝూము షోల‌కూ ప‌ర్మిష‌న్లు తెచ్చుకుని వీలైనన్ని ఆట‌లు వేయాలని చూస్తున్నారు. ఆయా షోల‌కు టికెట్ ధ‌ర రూ.500 గా డిసైడ్ చేశార్ట‌. ఏపీలో చాలా చోట్ల‌.. ఫ్యాన్స్ షోలు ప‌డే అవ‌కాశం ఉంది.

ఈ షోలకు ఫ్యాన్స్ మాత్రమే ఎక్కువగా వస్తారు. ఈ లెక్కలు ద్రుష్టిలో పెట్టుకొని మొదటి రోజుకే సాధ్యమైనంత లాగేయాలని చూస్తున్నారు బయ్యర్లు. ఈ 500 వందల టికెట్టు కౌంటర్ లో ఇస్తే.. అదే బ్లాక్ లో ఐతే 2000వేలకు కూడా వేల్లిపోవచ్చని చెబుతున్నారు. మొత్తానికి  వకీల్ షాబ్  ప్రీమియ‌ర్ చూడాలంటే లెక్క దండిగా అవుతుందని చెప్పుకొవాలి.