రూ.4 కోట్ల‌తో తీశారు.. రూ.50 కోట్లు వ‌చ్చాయ్‌!

dhrusyam

మ‌ల‌యాళ చిత్రాలంటే దాదాపుగా లో బ‌డ్జెట్ చిత్రాలే. రెండు మూడు కోట్ల‌తో సినిమాలు తీసేస్తారు. స్టార్ హీరో మోహ‌న్‌లాల్ లాంటి స్టార్ హీరోల‌ సినిమాల‌కు మ‌హా అయితే రూ.5 కోట్ల బ‌డ్జెట్ అవుతుంది. ఆయ‌న న‌టించిన దృశ్యం సినిమాకి ఎంతైందో తెలుసా…?? రూ.4 కోట్లు. కానీ రూ.50 కోట్లు వ‌సూలు చేసింది. దాంతో మ‌ల‌యాళ చిత్ర‌ప‌రిశ్ర‌మే కాదు.. యావ‌త్ దేశం షాక్‌కి గురైంది. ఈ చిత్రాన్ని రీమేక్ చేయ‌డానికి అన్ని భాష‌ల్లోంచీ భారీ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. తెలుగులో ఆ అవ‌కాశం వెంక‌టేష్‌కు ద‌క్కింది. ఆయ‌న ఈ చిత్రాన్ని ఇక్క‌డ రీమేక్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం కేర‌ళ‌లో షూటింగ్ జ‌రుగుతోంది. వెంకీ ప‌క్క‌న క‌థానాయిక‌గా మీనా న‌టిస్తోంది. తాజాగా మ‌ల‌యాళ దృశ్యం వంద రోజులు పండ‌గ చేసుకొంది. అయినా హౌస్‌ఫుల్‌గా సినిమా న‌డుస్తోంద‌ట‌. సినిమా థియేట‌ర్లోంచి వెళ్లిపోయేలోగా ఎంత వ‌సూలు చేస్తుందో చూడాలి. మ‌న‌మెప్పుడు ఇలా త‌క్కువ బ‌డ్జెట్‌తో నాణ్యమైన సినిమాలు తీసి.. ఇన్నేసి కోట్లు ద‌క్కించుకొంటామో..??