అఖండ ప్రమోషన్ అందుకే చేయలేదా..?

akhanda

బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ. బాలకృష్ణ కెరీర్ లో అతిపెద్ద రిలీజ్ గా అఖండ నిలిచింది. ఈ మధ్య కాలంలో బాలయ్య మూవీకి ఈ స్థాయి ప్రచారం దక్కలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ సైతం రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. వీరిద్దరి కలయికలో ఇప్పటికే రెండు చిత్రాలు వచ్చి బ్లాక్క్ బస్టర్ హిట్స్ సాధించడం తో ఈ సారి ఎలాంటి హిట్ అందుకుంటుందో అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ వచ్చారు. వారి ఎదురుచూపులు తగ్గట్లే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ టాక్ తో అంత సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఓ విషయం మాత్రం అభిమానులను కలిచివేస్తుంది. అదే సినిమా ప్రమోషన్.

మాములుగా బాలయ్య నుండి సినిమా వస్తుందంటే భారీగా ప్రమోషన్ చేస్తారు. కానీ అఖండ విషయంలో మాత్రం కేవలం ప్రీ రిలీజ్ తప్ప మరో ప్రమోషన్ చేయలేదు. ఎందుకు చేయలేదా అని అంత మాట్లాడుకుంటున్నారు. మరెందుకు ఇలా జరుగుతుందంటే? ఆసక్తికర సంగతులే బయటకు వస్తున్నాయి. ఏపీలో ఇటీవలే టిక్కెట్ ధరలపై జీవో రిలీజ్ అయిన సంగతి తెలసిందే. అలాగే తెలంగాణలోనూ టిక్కెట్ ధరలు ప్రభుత్వం తగ్గించినా..హైకోర్టు పెంచుకోమని ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ బాలయ్య ..బోయపాటి ప్రచారంలో పాల్గొంటే ఈ సమస్యల గురించి మాట్లాడాల్సి ఉంటుంది. బాలకృష్ణ హిందుపురం ఎమ్మెల్యే గా కూడా ఉన్నారు కాబట్టి ..అదీ ప్రతిపక్ష పార్టీ కాబట్టి కచ్చితంగా మాట్లాడాలి. ఇప్పటికే పరిశ్రమ తరుపును పవన్ కల్యాణ్.. చిరంజీవి..సురేష్ బాబు సహా కొంత మంది పెద్దలు స్పందించారు. కానీ బాలయ్య మాత్రం తూతూ మంత్రంగానే స్పందించారు. వకీల్ సాబ్ ఘటనలు పునరావృతం అవుతాయనే ఆయన అలా చేశారా? అన్నది కూడా ఇక్కడ ఒక సందేహం.