సంక్రాంతి సంబరాల్లో బాలయ్య.. గుర్రం ఎక్కి హల్చల్

ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. పల్లె, పట్టణం అనే తేడాలు లేకుండా ప్రజలంతా కుటుంబ సభ్యులతో సంక్రాంతి వేడుకల్లో భాగం అవుతున్నారు. ఇక బాలయ్య సైతం సంక్రాంతి పండగను కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకుంటున్నారు.

బాలయ్య భార్య వసుంధరతో కలిసి తన సోదరి పూరందేశ్వరి ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న ప్రకాశంలో జిల్లాలోని కారంచేడులో భోగి సంబరాలు జరుపుకున్న బాలయ్య ఈ రోజు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా బాలయ్య గుర్రం ఎక్కి హంగామా చేశారు. అంతేగాక గుర్రంతో కలిసి ఆయన స్టెప్పులు వేయించారు.

ఈ ఏడాది భోగి పండగను తన అక్క ఇంట్లో జరుపుకోవడం కోసం బాలకృష్ణ తన భార్య తో కలిసి గురువారం ప్రకాశం జిల్లా కారంచేడుకు చేరుకున్నారు. ఇక బాలకృష్ణ దంపతులతో పాటు జయకృష్ణ, దగ్గుబాటి కుటుంబాలకు చెందిన బంధువులు గురువారం కారంచేడుకు చేరుకున్నారు.