భలే భలే మగాడివోయ్ సీక్వెల్ పై డైరెక్టర్ క్లారిటీ !


ఈ రోజుల్లో, బస్ స్టాప్, ప్రేమ కథా చిత్రమ్ లాంటి వరుస హిట్లతో తెలుగు తెరపైకి బులెట్ లా దూసుకొచ్చాడు డైరెక్టర్ మారుతీ. తక్కువ బడ్జెట్ తో మంచి సినిమాలు తీయడం ఇతని స్పెషల్. డైరెక్టర్ గానే కాకుండా కొన్ని సినిమాలకు ప్రొడ్యూస్ కూడా చేసాడు. మారుతీ డైరెక్టర్ గా 2015లో నాని – లావణ్య త్రిపాఠి జంటగా నటించిన భలే భలే మగాడివోయ్ చిత్రమ్ సూపర్ హిట్ అయింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మారుతి మాట్లాడుతూ .. ‘భలే భలే మగాడివోయ్’ సినిమా తర్వాత సీక్వెల్ చేయమని చాలామంది చెప్పారు. సోషల్ మీడియా ద్వారా కూడా చాలా మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే అప్పుడు ఆ విషయంపై నేను అంతగా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ చేయాలని అనుకుంటున్నాను.
అయితే కథ ఆ సినిమాకి కొనసాగింపుగా కాకుండా, కామెడీతో కూడిన యాక్షన్ జోనర్లో నడిపిస్తే ఎలా ఉంటుందా? అని ఆలోచిస్తున్నాను. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పడానికి ఇంకా సమయం ఉంది. ఈ లోగా నేను చేయవలసిన సినిమాలు పూర్తి చేస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు.