ఫిబ్రవరి లోనే భీమ్లా నాయక్ రిలీజ్..

పవన్ కళ్యాణ్ – రానా కలయికలో రాబోతున్న భీమ్లా నాయక్ మూవీ కోసం యావత్ సినీ లోకం ఎదురుచూస్తుంది. ఫిబ్రవరి 25 లేదంటే ఏప్రిల్ 1 న రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించగా..ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఫిబ్రవరి 25 నే భీమ్లా నాయక్ వస్తుందని పక్కాగా సమాచారం అందుతుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ ధర GOని సవరించాలని భావిస్తుండగా, కొత్త GO ఫిబ్రవరి 15న విడుదల కానుందని భావిస్తున్నారు. అంతలోపు రాత్రి కర్ఫ్యూలు, 50 శాతం ఆక్యుపెన్సీ కూడా ఎత్తేస్తారు. కాబట్టి అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానున్నాడు. మేకర్స్ త్వరలో ఈ వార్తను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లను బ్లాక్ చేయమని చెప్పి అగ్రిమెంట్లు కూడా చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. . ‘భీమ్లా నాయక్’కు సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా..త్రివిక్రమ్ మాటలు అందించారు. థమన్ సంగీతం.