భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25 న రావడం కష్టమేనా..?

భీమ్లా నాయక్ నుండి సంక్రాంతి కానుకగా సరికొత్త పోస్టర్ వచ్చింది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న ఈ మాస్ మల్టీస్టారర్ మూవీని సితార ఎంటర్‌టైన్మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే పోస్టర్స్, సాంగ్స్ వచ్చి విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ మూవీ ఫిబ్రవరి 25 న రావడం కష్టమే అని అంటున్నారు ఫిలిం నగర్ జనాలు.

ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్స్ లేవు. సినిమా షూటింగ్ ల మీద ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయినప్పటికీ రెండు రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివ్ కేసుల్లో పెరుగుదల రేటు ఎక్కువగా ఉండటం.. థర్డ్ వేవ్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఇంకొన్నాళ్ళు సెట్స్ లో తిరిగి అడుగుపెట్టకూడదని నిర్ణయించుకున్నారట. మరి ఇదే నిజమైతే భీమ్లా రావడం కష్టమే.