ఎవడు హిట్తో ఫుల్ జోష్ మీదన్న రామ్చరణ్ మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో చెర్రీ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం జూన్ లేదా జులైలో సెట్స్పైకి వెళ్లనున్నట్లు సమాచారం. రామ్చరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్లో మూవీ వస్తుందని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తుంది. స్టోరీలో దమ్ములేని కారణంగా చెర్రీ ఆ ప్రాజెక్టును రిజెక్ట్ చేసినట్లు సమాచారం. తాజాగా బోయపాటి ఇటీవల ఓ కొత్త స్టోరీని వినిపించాడట. కథ బాగుందని చెప్పడమేకాదు.. సినిమా చేద్దామని చెర్రీ మాటిచ్చాడని ఫిలింనగర్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్న చెర్రీ ఈ చిత్రం తర్వాత బోయపాటి సినిమానే చేస్తాడని వినిపిస్తోంది.