ఆ న‌లుగురికీ నివాళి!

UB

ఉల‌వ‌చారు బిరియానీ సినిమా చూసి అంద‌రూ పెద‌వి విరుస్తున్నారు. ఏమిటీ సినిమా? ఇలా ఉందేమిటి?? అంటూ నొస‌లు చిట్లిస్తున్నారు. ద‌ర్శ‌కుడిగా ప్ర‌కాష్‌రాజ్ విఫ‌ల‌మ‌య్యాడ‌ని అంద‌రూ ముక్త‌కంఠంతో చెబుతున్నారు. కానీ ఒక్క విష‌యంలో మాత్రం ప్ర‌కాష్ రాజ్ అంద‌రి మ‌న‌సులూ గెలుచుకొన్నారు. ఇటీవ‌ల తెలుగు వారికి విషాదాన్ని మిగిల్చి స్వ‌ర్గ‌స్తులైన ఏఎన్నార్‌. శ్రీ‌హ‌రి, ఏవీఎస్‌, ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌హ్మ‌ణ్యంల‌కు ఈ సినిమా ప్రారంభంలో నివాళి అర్పించాడు. మీరు భౌతికంగా మా మ‌ధ్య లేక‌పోయానా, మాన‌సికంగా మాతోనే ఉన్నారు.. అంటూ ఓ సెంటిమెంట్ ట‌చ్ ఇచ్చాడు. దివంగ‌త న‌టుల‌కు త‌న సినిమాతో నివాళి అర్పించి.. వారిపై త‌న‌కున్న అభిమానాన్ని ఇలా చాటుకొన్నాడు. ఆ విషయంలో మాత్రం మార్కులు కొట్టేశాడు.