డియర్ కామ్రేడ్ మూవీ టాక్ వచ్చేసింది..

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ..రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం డియర్ కామ్రేడ్ . భరత్ కమ్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సౌత్ నాల్గు భాషల్లో ఒకేసారి విడుదల కాబోతుండడం తో ఈ చిత్ర ఓపెనింగ్స్ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ఫస్ట్ టాక్ బయటకొచ్చి ..సినిమా ఫై ఇంకాస్త క్రేజ్ తెచ్చిపెడుతుంది.

తాజాగా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని చూసేశారు. ఈ సినిమా ఎలా ఉందనేది సోషల్ మీడియా ద్వారా తెలియజేసి అభిమానుల్లో సంబరాలు నింపారు. ‘డియర్ కామ్రేడ్‌ను చూసిన మొదటి ప్రేక్షకుడిని నేను కావడం సంతోషంగా ఉంది. సినిమా చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఉద్వేగంతో కూడిన ప్రేమకథ. విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటన మరో స్థాయిలో ఉంది. సినిమా అద్భుతంగా సాగుతుంది.
ప్రేక్షకులకు ముఖ్యమైన, సంబద్ధమైన సందేశాన్ని ఇస్తుంది. డైరెక్టర్ భరత్ కమ్మ శక్తివంతంగా డైరెక్ట్ చేశారు. మైత్రీ మూవీస్ అద్భుతంగా నిర్మించింది. జస్టిన్ ప్రభాకరన్ చాలా మంచి సంగీతం అందించారు. డియర్ కామ్రేడ్‌ను ధర్మ మూవీస్ హిందీలో రీమేక్ చేస్తుందని ప్రకటించడం పట్ల ఎంతో సంతోషిస్తున్నాను!! చాలా చాలా ఆనందంగా ఉంది!!!’ అని కరణ్ జోహార్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.