కరోనాతో కెజిఎఫ్ హీరో డైరెక్టర్ మృతి

కరోనా మహమ్మారి మరో ప్రముఖ డైరెక్టర్ ను మిగేసింది. కెజిఎఫ్ ఫేమ్ యాష్ తో ‘కిచ్చా’, ‘కిరాతక’ సినిమాలను డైరెక్ట్ చేసిన ప్రదీప్‌ రాజ్‌ కన్నుమూశారు. కొద్దీ రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

గురువారం ఈయన ఆరోగ్యం విషమించడం తో చికిత్స జరుగుతుండగానే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రదీప్ రాజ్ గత 15 ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్నారని, దాంతో పాటు ఈ కరోనా కూడా రావడంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని, చికిత్సకు ఆయన అవయవాలు సహకరించలేదని తెలిపారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.