నాగార్జున ‘ఘోస్ట్’ డైరెక్ట్ ఓటిటి రిలీజ్ ?


బంగార్రాజు తో సూపర్ హిట్ అందుకున్న కింగ్ నాగార్జున.. ఘోస్ట్ గా రాబోతున్నాడు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో నారాయన్ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధంగా ఉంది . ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా సోనాల్ చౌహాన్ నాగ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. క్రేజీ థ్రిల్లర్ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ ఫస్ట్ లుక్ తోనే అంచనాలు రేపింది.

అయితే ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటిటి లో విడుదల చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కోవిడ్ అనంతరం చాల సినిమాలు డైరెక్ట్ గా ఓటిటి లోనే విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి ఓటిటి ఆఫర్ భారీగా రావడంతో నిర్మాతలు థియేటర్ లో విడుదల చేయాలా లేక ఓటిటి లో విడుదల చేయాలా అన్న డైలమా పడ్డారట.