Bhimaa : రాక్షసుల్ని వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చేసాడు..


మాచో స్టార్ గోపీచంద్‌ హీరోగా తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భీమా’. ఈ చిత్రానికి ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పలు పోస్టర్స్ గోపీచంద్ ను యాక్షన్ ప్యాక్డ్ అవతార్ లో ప్రజెంట్ చేశాయి. తాజాగా ఈ సినిమా కి సంబందించిన టీజర్ ను ఈరోజు రిలీజ్ చేశారు మేకర్స్.

“యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్.. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ , ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అనే భగవద్గీత శ్లోకాల పవర్ ఫుల్ వాయిస్‌ ఓవర్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ‘ఈ రాక్షసుల్ని వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడ్రా’ అంటూ ఎద్దుపై కూర్చొని మ్యాసివ్, వైల్డ్ అవతారంలో వున్న గోపీచంద్ ని ఎలివేట్ విధానం చాలా బాగుంది. టీజర్ ద్వారా సినిమాపై మంచి హైప్ ని క్రియేట్ చేసారు మేకర్స్.

ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే ‘భీమా’ ఫిబ్రవరి 16, 2024న ప్రేక్షకుల ముందుకు రానుందని టీజర్ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు మేకర్స్.