గోపీచంద్ కొత్త సినిమా డేట్ ఫిక్స్


హీరో గోపీచంద్ తన 25వ చిత్రాన్ని నూతన దర్శకుడు కె. చక్రవర్తి డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మెహరీన్‌ కథానాయిక కె.కె. రాధామోహన్‌ నిర్మాత. ఈ సినిమాకు‘పంతం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మే 18న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది

గోపీచంద్ కు ఓ సెంటిమెంటు వుంది. ఆయన సినిమా టైటిల్ ను రెండు ఆక్షరాలు వుండేలా పెడుతుంటారు. అందులోనూ చివర్లో సున్నా వుండేలా చూస్తారు. యజ్నం, రణం, శంఖం, శౌర్యం, లౌఖ్యం, సౌఖ్యం ఇలా రెండు అక్షారాల సున్నాతో ఎండ్ అవుతుంటాయి ఆయన టైటిల్స్. ఇప్పుడు ‘పంతం’ సినిమాకి కూడా ఇదే సెంటిమెంట్ ను ఫాలో అయ్యారు.