Hanu Man : ఓటీటీలో కంటే ముందే టీవీలో ‘హనుమాన్’ !


యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’ సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ ఈ చిత్రం ఓటీటీ కంటే ముందే టీవిలో ప్రసారం కానుంది. మార్చి 16న రాత్రి 8 గంటలకు కలర్స్‌ సినీప్లెక్స్‌ ఛానల్‌ మరియు జియో సినిమాలో కేవలం హిందీలో మాత్రమే హనుమాన్ మూవీ టెలికాస్ట్‌ అవుతుంది. ఈవిషయాన్ని ప్రశాంత్ వర్మ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.

Gaami : గామి ఫస్ట్ డే కలెక్షన్స్.. విశ్వక్ కెరీర్లోనే హైయెస్ట్ !

ఇకపోతే హనుమాన్‌ మార్చి 2 నుంచి జీ 5లో స్ట్రీమింగ్‌ అవుతుందంటూ కొద్ది రోజులు ప్రచారం సాగింది. మరి కొద్ది రోజులు మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న అంటూ టాక్ వచ్చింది. కానీ అప్పుడు కూడా స్ట్రీమింగ్ కాకపోయేసరికి అభిమానులు నిరాశకు గురైయ్యారు. ఇక దీనిపై స్పీన్ధించిన జీ5 సంస్థ హనుమాన్ ఓటీటీ విడుదలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. ఇకపోతే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.330 కోట్లకి పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. మరి ఓటీటీలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. కాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ సినిమా రాబోతుంది.