కరోనా మహమ్మారి చిత్రసీమను వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే పలువుర్ని పొట్టనపెట్టుకున్న ఈ భూతం..తాజాగా మరో సినీ గేయ రచయితను బలి తీసుకుంది. బాలీవుడ్ సినీ గేయ రచయిత ఇబ్రహీం ఆష్క్ (70) కరోనా మహమ్మారి సోకడంతో మరణించారు.
ఈ విషయాన్ని ఇబ్రహీం ఇష్క్ కుమార్తే.. ముసాఫా ఖాన్ అధికారికంగా ప్రకటించారు. గత కొద్ది రోజుల క్రితం ఇబ్రహీం ఆష్క్ కు కరోనా వైరస్ తెలిపిన ఈమె.. శనివారం రోజు ఇబ్రహీం ఆష్క్ కు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురు అయిందని..ముంబై లోని మెడిటెక్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స చేసినప్పటికీ..కరోనా తో పాటు న్యూమోనియా కూడా సోకడం ఆయన ప్రాణాలు నిలువలేకపోయాయని చెప్పుకొచ్చింది. ఈరోజు సోమవారం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని ఇబ్రహీం ఆష్క్ కుమార్తే.. ముసాఫా ఖాన్ తెలిపింది.