చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ట్వీట్

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి తెలుగుదేశం నేతలు , కార్య కర్తలే కాదు వైసీపీ అధినేత , ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సైతం ట్విట్టర్ లో బాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా సీఎం వెల్లడించారు. ‘‘చంద్రబాబు గారు త్వరగా కోలుకొని, ఆరోగ్యవంతులుగా తిరిగి రావాలి’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.

నిన్న సోమవారం ఆయన తనయుడు నారా లోకేష్ కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఈరోజు చంద్రబాబు నాయుడు కు కరోనా సోకడంతో తెలుగుదేశం శ్రేణుల్లో , కార్య కర్తల్లో ఆందోళన పెరిగింది. చంద్రబాబు స్వయంగా ట్విట్టర్ ద్వారా తనకు కరోనా సోకినా విషయాన్నీ తెలిపారు. ప్రస్తుతం తాను సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు .. వైద్యుల సూచన మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసినవారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని చంద్రబాబు సూచించారు. చంద్రబాబు తో పాటు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు దేవినేని ఉమా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనను కలిసినవారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.