లోకనాయకుడు కమల్ హాసన్ రీసెంట్ గా కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. అమెరికా టూర్ నుండి వచ్చిన ఆయనకు దగ్గు , జలుబు రావడం తో కరోనా టెస్ట్ చేసుకోగా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్లో చికిత్స అందిస్తున్నారు.
గత రాత్రి కమల్ ఆరోగ్యంపై అప్డేట్ ఇవ్వడానికి ఆసుపత్రి అధికారులు కొత్త బులెటిన్ను విడుదల చేశారు. “శ్రీ కమల్ హాసన్ శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్లో చేరారు. ఆయన బాగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా కొనసాగుతోంది” అని బులెటిన్లో పేర్కొన్నారు. దీంతో ఆయన ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్న అభిమానులకు కాస్త ఊరట కలిగింది.