తెలుగు చిత్రసీమలో విషాదం..అనారోగ్యంతో ప్రముఖ నటుడు మృతి

చిత్రసీమలో వరుస మరణాలు ఆగడంలేదు. కరోనా తో కొంతమంది చనిపోతుంటే..మరికొంతమంది అనారోగ్యం తో మరణిస్తున్నారు. తాజాగా ప్రముఖ నటుడు కొంచాడ శ్రీనివాస్‌ (47) అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు.

అతడు సుమారు 40కి పైగా సినిమాలు, 10కిపైగా టీవీ సీరియళ్లలో నటించి మెప్పించాడు శ్రీనివాస్. గతంలో షూటింగ్‌ సమయంలో పడిపోవడంతో శ్రీనివాస్‌కు ఛాతీపై దెబ్బ తగిలిందని, తర్వాత గుండె సమస్యలు వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. శ్రీనివాస్ మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.