మెగా హీరో ఫై కృతి శెట్టి కన్ను

ఉప్పెన మూవీ తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి..మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని అందర్నీ ఆకట్టుకుంది. ఆ తర్వాత శ్యామ్ సింగ రాయ్ మూవీ తో రెండో హిట్ కొట్టింది.రీసెంట్ గా బంగార్రాజు తో హ్యాట్రిక్ కొట్టి గోల్డెన్ లెగ్ గా మారింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో మూడు సినిమాలు ఉండగా..తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తెలుగులో ఎవరి సరసన నటించాలని ఉందని యాంకర్ గా అడుగగా..టక్కున రామ్ చరణ్ పేరు చెప్పింది. రంగస్థలం సినిమా చూసాక ఆయన నటనకు ఫిదా అయిపోయానని, అందులో చరణ్ చాలా గొప్పగా నటించారు.. ఆ సినిమా చూశాక ఆయనతో నటించాలని ఉంది అని తన మనసులో మాట బయటపెట్టింది. మరి కృతి కోరిక ను చరణ్ ఎప్పుడు తీరుస్తాడో చూడాలి.